Anushka Sharma Wished Virat: కోహ్లీ సెంచరీపై అనుష్క శర్మ రియాక్షన్.. ఏమన్నదంటే..
టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. గత రెండు రోజుల క్రితం టీమిండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించి సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర ట్వీట్ చేశాడు.
Anushka Sharma Wished Virat: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. గతకొంతకాలంగా ఫామ్ కోల్పోయి గ్రౌండ్ లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బందుతున్న కోహ్లీ ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేసి తన క్రికెట్ కెరియర్ లో 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. 2019 నవంబర్లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేశాడు, ఆ తరువాత మళ్లీ అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయడం పట్ల పలువురు తాజా, మాజీ క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
Virat Kohli: కొంత కాలంగా మెరుగైన ఆటతీరు కనబర్చకపోవడంపై విరాట్ కొహ్లీ స్పందన
చాలాకాలం తరువాత ఫాంలోకి వచ్చి సెంచరీ చేయడం పట్ల విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తంచేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే నేను 34ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నానని, ఈ సెంచరీ నాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నానని తెలిపాడు. నాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్న అనుష్కకు, నా కుమార్తె వామికకు ఈ సెంచరీని అంకితమిస్తున్నానని కోహ్లీ తెలిపాడు. అయితే కోహ్లీ సెంచరీ చేయడం పట్ల ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్లో అనుష్క శర్మ ఎమోషనల్ పోస్టు చేశారు.
View this post on Instagram
అనుష్క శర్మ తన పోస్టులో భర్త కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించింది. ఎల్లప్పుడూ, ప్రతీ విషయంలో నీతో ఉంటా అంటూ కోహ్లీ సెంచరీ చేసిన ఫొటోను జత చేసింది. కోహ్లి, అనుష్కలు 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 2021లో అనుష్క శర్మ కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు వామిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం అనుష్క శర్మ చక్దా ఎక్స్ప్రెస్ అనే క్రికెట్ బయోపిక్ లో నటిస్తోంది.