Bangladesh vs India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్‌ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్

రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. నేటి రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఇచ్చిన 272 లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. ఇరు క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రోహిత్ శర్మ అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ 5 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటి మ్యాచులో గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో నేటి మ్యాచులో 9వ స్థానంలో దిగిన రోహిత్ శర్మ చివరి ఓవర్లలో 5 సిక్సులు, 3 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు.

Bangladesh vs India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్‌ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్

Bangladesh vs India

Bangladesh vs India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. నేటి రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఇచ్చిన 272 లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. ఇరు క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రోహిత్ శర్మ అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ 5 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటి మ్యాచులో గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో నేటి మ్యాచులో 9వ స్థానంలో దిగిన రోహిత్ శర్మ చివరి ఓవర్లలో 5 సిక్సులు, 3 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆశలు చిగురించాయి. చివరి బంతికి సిక్సు కొడితే భారత్ గెలిచే అవకాశం వచ్చింది. అయితే, ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన బంతిని రోహిత్ శర్మ సిక్సుగా మలచలేకపోయాడు.

టీమిండియా బ్యాట్స్‌మెన్ లో విరాట్ కోహ్లీ 5, శిఖర్ ధావన్ 8, శ్రేయాస్ అయ్యర్ 82, వాషింగ్టన్ సుందర్ 11, కేఎల్ రాహుల్ 14, అక్షర్ పటేల్ 56, శార్దూల్ ఠాకూర్ 7, దీపక్ చాహర్ 11, రోహిత్ శర్మ 51(నాటౌట్), సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో ఎబాదత్ 3, మెహిదీ హసన్ 2, షకీబ్ 2, మహ్మదుల్లా, ముస్తఫిజర్ చెరో వికెట్ తీశారు.

టీమిండియా 50 ఓవర్లలో 266/9 పరుగులు చేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ బంగ్లా ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ 83 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ ఇచ్చిన 271 పరుగులు చేసింది. అనముల్ హక్ 11, లిట్టొన్ దాస్ 7, నజ్ముల్ షాంటో 21, షకీబ్ హాసన్ 8, రహీం 12, మహ్ముదుల్లా 77, అఫిఫ్ 0, మెహిదీ హసన్ 100 (నాటౌట్), నాసం అహ్మద్ 18(నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా ఇటీవల తొలి మ్యాచు కూడా ఓడిపోవడంతో సిరీస్ కోల్పోయింది. మూడో వన్డే నామమాత్రంగా జరగనుంది.

India-China: చైనాకు రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వార్నింగ్