BCCI Hikes: క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ
దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా సోమవారం ట్వీట్ చేశారు.
Pay rise: దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా సోమవారం ట్వీట్ చేశారు. జయ్ షా ట్వీట్ ప్రకారం.. 40మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన దేశీయ ఆటగాళ్లకు రూ. 60వేలు, 23 ఏళ్లలోపు ఆటగాళ్లకు రూ. 25వేలు మరియు 19 ఏళ్లలోపు క్రికెటర్లకు రూ. 20వేలు లభిస్తుంది. అంతకుముందు రంజీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటే మ్యాచ్కు రూ.35వేలు మాత్రమే ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దానిని ఎకంగా రూ.60వేలకు పెంచినట్లు బీసీసీఐ ప్రకటించింది.
తుది జట్టులో ఆడే ప్లేయర్స్కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజర్వ్ ప్లేయర్స్ ఇందులో సగం మొత్తం అందుకుంటారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశవాళీ సీజన్ నష్టపోవడంతో క్రికెటర్లకు పరిహారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. 2019-20 దేశీయ సీజన్లో పాల్గొనే క్రికెటర్లకు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా వేసిన 2020-21 సీజన్కు పరిహారంగా 50 శాతం అదనపు మ్యాచ్ ఫీజు లభిస్తుందని జే షా ప్రకటించారు.
ఇప్పటివరకు ఎంత మ్యాచ్ ఫీజు వచ్చింది?
ఇప్పటివరకు సీనియర్ దేశవాళీ క్రికెటర్లు రంజీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు ఒక్కో మ్యాచ్కు రూ.35,000 వచ్చేది. ఇది కాకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కోసం ఆటగాళ్లకు రూ.17,500 ఇచ్చేవారు. మ్యాచ్ ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లకు ఈ డబ్బు అందుబాటులో ఉంది. రిజర్వ్ ప్లేయర్లకు ఫీజులో సగం ఇస్తారు. అక్టోబర్ 2019లో, సౌరవ్ గంగూలీ BCCI అధ్యక్షుడయ్యాక దేశీయ క్రికెటర్ల కోసం రాష్ట్ర అసోసియేషన్ల ద్వారా కేంద్ర ఒప్పందాలను ప్రవేశపెట్టారు.