ICC WTC final: వరల్డ్ ఛాంపియన్షిప్కు టీమిండియా బృందాన్ని అనౌన్స్ చేసిన బీసీసీఐ
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీ సేన.
ICC WTC final: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీ సేన.
జట్టులో వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ. వైస్ కెప్టెన్ అజింకా రహానె, ప్రీమియర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పూజారా స్థానాల్లో ఆశించినట్లుగా ఎటువంటి మార్పులు కనిపించలేదు. యువ ప్లేయర్ శుభ్మన్ గిల్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీల పేర్లను 15మంది బృందంలో చేర్చారు.
?️ #TeamIndia announce their 15-member squad for the #WTC21 Final ? ? pic.twitter.com/ts9fK3j89t
— BCCI (@BCCI) June 15, 2021
బౌలింగ్ దళంలో ఫేస్ విభాగానికి బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లు ఎంపికయ్యారు. యువ ప్లేయర్లు.. మొహమ్మద్ సిరాజ, రిషబ్ పంత్ లను జట్టులోకి చేర్చుకున్నారు. పంత్ కు బ్యాకప్ గా.. వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు జట్టులోకి ఎంట్రీ వచ్చింది.
బృందాన్ని కన్ఫామ్ చేయడంతో షమీ, విహారీలు గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాకపోతే మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ కు స్థానం దక్కలేదనేది మరో సారి క్లియర్ అయింది. స్పిన్నర్ అక్సర్ పటేల్ ను కూడా పక్కకు పెట్టేశారు.
మొత్తంగా 15మందితో కూడి టెస్ట్ ఛాంపియన్షిప్ స్క్వాడ్:
Rohit Sharma, Shubman Gill, Cheteshwar Pujara, Virat Kohli, Ajinkya Rahane, Rishabh Pant, Ravindra Jadeja, Hanuma Vihari, Umesh Yadav, Ravichandran Ashwin, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah, Mohammed Siraj, Wriddhiman Saha.