BCCI: కేఎల్ రాహుల్, పంత్, పాండ్యా, కార్తీక్ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు డౌటే
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు.
BCCI: ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు.
కాకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో బీసీసీఐ ప్రవేశపెట్టిన రూల్ ప్రకారం.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు వారి స్థానం మీద డౌట్ అంటున్నారు. రాబోయే సిరీస్లో భారత్కు ఆడేందుకు ఎంపికైన దాదాపు అందరు ఆటగాళ్లు రెండు నెలలుగా IPL ఆడుతున్నారు. మరికొందరికి గాయాలు కావడం BCCIకి బాగా తెలుసు.
“దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్కి ఎంపికైన ఆటగాళ్లందరూ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్యాంపులో చేరాలి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాబట్టి ఈ క్యాంప్కు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. హర్షల్ పటేల్కు కుట్లు పడ్డాయి. అందరూ బాగున్నారని నిర్ధారించడం చాలా ముఖ్యం” అని BCCI బోర్డు అధికారి పేర్కొన్నారు.
Read Also : బీసీసీఐ కొత్త ఐపీఎల్ రూల్.. సీఎస్కేకే ఫేవర్గా ఉందంట
ఎంపిక చేసిన స్క్వాడ్లోని సభ్యులంతా జూన్ 5 2022న క్యాంప్లో చేరాల్సిందిగా ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పరీక్షకు హాజరు కావాలి. ఈ శిబిరానికి NCA చీఫ్ VVS లక్ష్మణ్, ఫిజియో నితిన్ పటేల్ నాయకత్వం వహిస్తారు. వీరిద్దరూ ఎంపిక చేసిన ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షిస్తారు.
భారత T20I స్క్వాడ్ vs SA – KL రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (VC) (wk), దినేష్ కార్తీక్ (wk), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, Y చాహల్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్