Rohit Sharma: క‌రోనా నుంచి కోలుకుని నెట్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్

క‌రోనా కార‌ణంగా కొన్ని రోజులుగా ఐసోలేష‌న్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ కోలుకున్నాడు. అత‌డికి క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా నెగెటివ్‌గా తేలింది. అంతేకాదు, రోహిత్ శ‌ర్మ‌ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అత‌డితో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఉమేశ్ యాద‌వ్ కూడా ప్రాక్టీస్ చేశారు.

Rohit Sharma: క‌రోనా నుంచి కోలుకుని నెట్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్

Rohit Sharma

Rohit Sharma: భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతోన్న ఐదో టెస్టు నుంచి క‌రోనా కార‌ణంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వైదొలిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కెప్టెన్ బాధ్య‌త‌లు ఫాస్ట్ బౌల‌ర్‌ జ‌స్ప్రిత్ బుమ్రా నిర్వ‌హిస్తున్నాడు. అయితే, క‌రోనా కార‌ణంగా కొన్ని రోజులుగా ఐసోలేష‌న్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ కోలుకున్నాడు. అత‌డికి క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా నెగెటివ్‌గా తేలింది. అంతేకాదు, రోహిత్ శ‌ర్మ‌ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అత‌డితో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఉమేశ్ యాద‌వ్ కూడా ప్రాక్టీస్ చేశారు.

Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొర‌త‌.. శ్రీ‌లంక‌లో ఇప్ప‌టికీ తెరుచుకోని పాఠ‌శాల‌లు

అశ్విన్‌, ఉమేశ్ కూడా ఐదో టెస్టు మ్యాచులో ఆడ‌ట్లేద‌న్న విష‌యం తెలిసిందే. ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచుల్లో ఆడ‌తాడు. కాగా, గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టునే ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 ప‌రుగులు చేసి ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 284 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగుల‌తో బ్యాటింగ్ కొన‌సాగిస్తోంది. ఈ సిరీస్‌లో భారత్ ఇప్ప‌టికే 2-1 ఆధిక్యంలో ఉంది.