Vinesh Phogat, Ravi Dahiya Win Gold : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. రెండు బంగారు పతకాలు కైవసం

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో రెండు గోల్డ్ మెడల్స్ అందించారు.

Vinesh Phogat, Ravi Dahiya Win Gold : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. రెండు బంగారు పతకాలు కైవసం

Vinesh Phogat, Ravi Dahiya Win Gold : బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో రెండు గోల్డ్ మెడల్స్ అందించారు. ఇప్పటికే ముగ్గురు కుస్తీ వీరులు బజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ గోల్డ్ మెడల్స్ సాధించగా.. శనివారం రవి దహియా, వినేష్‌ పొగట్‌ స్వర్ణాలు సాధించారు.

పురుషుల ఫ్రీ స్టైల్ 57కిలోల విభాగంలో ఫైనల్ లో రవి దహియా.. నైజీరియాకు చెందిన ఎబికేవినెమోను మట్టికరిపించి పసిడి సాధించాడు. మహిళల 53 కేజీల విభాగంలో వినేష్‌ పొగట్‌ .. శ్రీలంకకు చెందిన చమోద్య కేశనీపై విజయం సాధించింది. రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 11కి చేరింది.

ఇక రవి దహియా 3 సార్లు ఆసియా చాంపియన్ గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం విశేషం.

వినేశ్ పొగట్ కూడా అరుదైన ఘనత సాధించింది. వినేశ్ పొగట్ కు కామన్ వెల్త్ గేమ్స్ లో ఇది వరుసగా మూడో పసిడి పతకం కావడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ వినేశ్ పొగట్ స్వర్ణం సాధించింది. ఇలా ఆసియా గేమ్స్ తో పాటు కామన్ వెల్త్ గేమ్స్ లోనూ గోల్డ్ సాధించిన తొలి భారత మహిళగా వినేశ్ పొగట్ ఘనత సాధించింది. అంతేకాదు.. కామన్ వెల్త్ గేమ్స్ లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత మహిళగానూ వినేశ్ పొగట్ చరిత్ర లిఖించింది.

 

రవి దహియాపై ప్రధాని మోదీ ప్రశంసలు:

పూజా గెహ్లోత్‌కు కాంస్యం
రెజ్లింగ్‌ మహిళల 50కేజీల విభాగంలో పూజా గెహ్లోత్‌ కాంస్యం సాధించింది. కామన్ వెల్త్‌ క్రీడల్లో 50కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆమె 12-2తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టెల్టే లామోఫాక్ లెచిడ్జియోను చిత్తు చేసింది.

 

తొలి భారత మహిళగా వినేశ్ పొగట్ ఘనత: