కోహ్లీ.. అనుష్క కుక్క అని పోల్చిన కాంగ్రెస్ లీడర్

కోహ్లీ.. అనుష్క కుక్క అని పోల్చిన కాంగ్రెస్ లీడర్

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్రాకర్స్ పేల్చి పర్యావరణాన్ని కాపాడాలంటూ అభిమానులకు సలహా ఇచ్చాడు. దేశమంతా దీపావళి సందర్భంగా అలా ఉండాలంటూ సూచించాడు. దీనిపై ఉదిత్ రాజ్ అదే మీనింగ్ వచ్చినా కోహ్లీని కుక్కలా పోల్చుతూ కామెంట్ చేశాడు.

‘అనుష్క తన కుక్క విరాట్ కోహ్లీపై జాగ్రత్త తీసుకోనవసరం లేదు. కుక్క కంటే విశ్వాసమైనది మరొకటి ఉండదు. కోహ్లీ ఆల్రెడీ పర్యావరణం కాలుష్యం చేయొద్దని లుచ్చా, లఫంగాలు, మూర్ఖులకు చెప్పాడు. ఓ సారి మీ డీఎన్ఏ చెక్ చేయించుకోండి. మీరిక్కడి వాళ్లేనా కాదో తెలుస్తుంది’ అని పోస్టు పెట్టాడు.



అంతకంటేముందు విరాట్ కోహ్లీ ఇన్‌స్టా ఓ వీడియో పోస్టు చేశాడు. ‘గుర్తు పెట్టుకోండి ప్లీజ్. క్రాకర్స్ పేల్చకండి. పర్యావరణాన్ని కాపాడండి. పండుగ సందర్భంగా ఇంట్లో మీకు ఇష్టమైన వారితో గడిపి దీపాలు వెలిగించి స్వీట్స్ పంచుకోండి’ అని అందులో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ట్రైనింగ్ సెషన్ ఇప్పటికే మొదలుపెట్టేసింది. ఇక కోహ్లీ జనవరిలో తండ్రి కాబోతున్నట్లు సమాచారం. దీనికోసమే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రానున్నాడు కోహ్లీ.