జలకాలట : అటు కోహ్లీతో అనుష్క, ఇటు కూతురితో ధోని
ఇద్దరు స్టార్ బ్యాట్ మెన్స్ విరామ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. బీచ్లో కోహ్లీ – అనుష్క, స్విమ్మింగ్ ఫూల్లో కూతురితో ధోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెస్టిండీస్ పర్యటన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య టాలీవుడ్ నటి అనుష్కతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ ట్వీట్ చేసిన ఓ ఫొటో వైరల్ అయ్యింది. ఆ ఫొటో ఓ బీచ్ దగ్గర దిగింది కావడం విశేషం. అందులో అనుష్క బికీనీ ధరించింది. అనుష్క ఒడిలో కోహ్లీ సేద తీరుతున్నాడు.
మరోవైపు ధోని..తన కూతురికి జీవాకు స్విమ్మింగ్ నేర్పుతున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటో వైరల్ అయ్యింది. కొద్ది రోజుల పాటు క్రికెట్కు దూరంగా ధోని ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మిలట్రీలో విధులు నిర్వర్తించాడు.