IPL 2022: బీసీసీఐ కొత్త ఐపీఎల్ రూల్.. సీఎస్కేకే ఫేవర్‌గా ఉందంట

ఐపీఎల్ సీజన్ కు ముందుగా బీసీసీఐ చేసిన మార్పుల్లో ఒకటి డీఆర్ఎస్. ప్రతి ఇన్నింగ్స్ లో డీఆర్ఎస్ లను రెండుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. గతేడాది వరకూ ప్రతి ఇన్నింగ్స్..

IPL 2022: బీసీసీఐ కొత్త ఐపీఎల్ రూల్.. సీఎస్కేకే ఫేవర్‌గా ఉందంట

Csk Ms Dhoni

IPL 2022: ఐపీఎల్ సీజన్ కు ముందుగా బీసీసీఐ చేసిన మార్పుల్లో ఒకటి డీఆర్ఎస్. ప్రతి ఇన్నింగ్స్ లో డీఆర్ఎస్ లను రెండుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. గతేడాది వరకూ ప్రతి ఇన్నింగ్స్ లో ఒక్క జట్టుకు ఒక్క డీఆర్ఎస్ మాత్రమే ఉండేది. కానీ, ఆ లిమిట్ ను రెండుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

గత సీజన్లో స్టార్ ప్లేయర్లు సైతం ఈ డీఆర్ఎస్ కోసం నోరు పారేసుకున్న సందర్భాలు లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఇన్నింగ్స్ లో ఎక్స్‌ట్రా డీఆర్ఎస్ ఉంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో జరిగిన పొరబాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది ఐపీఎల్ కమిటీ.

ఈ నిర్ణయాన్ని చాలా ప్రశంసిస్తున్నప్పటికీ.. కొందరిలో అసంతృప్తి మిగిలే ఉంది. పైగా ఇది కచ్చితంగా సీఎస్కే ఫ్రాంచైజీకి అనుకూలంగా ఉండేందుకే ఇలా ఆలోచించారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. డీఆర్ఎస్‌లో చాలా వరకూ ధోనీకే సక్సెస్ రేట్ ఎక్కువ. ప్రత్యర్థి జట్ల కంటే ధోనీనే చాలా బాగా వాడుకుంటాడు ఈ అవకాశాన్ని అనే తెగ ఫీలైపోతున్నారు.

Read Also: చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్