డూ ఆర్ డై : కివీస్‌తో టీమిండియా కీ ఫైట్

ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 03:26 AM IST
డూ ఆర్ డై : కివీస్‌తో టీమిండియా కీ ఫైట్

ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.

ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. కానీ… టీ20లకు వచ్చే సరికి మాత్రం బొక్కబోర్లా పడింది. ఫస్ట్ టీ20లో 80పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అత్యధిక రన్స్ తేడాతో ఓడిన చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో… ఆక్లాండ్‌లో 2019, ఫిబ్రదరి 8వ తేదీ శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే… రెండో మ్యాచ్‌తోనే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది.

 

ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో ఇండియా, కివీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచుల సిరీస్‌లో ఫస్ట్ టీ20లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్…సిరీస్ నెగ్గేయాలనే ఆలోచనతో ఉంది. సిరీస్ మీద ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా ఉంది. న్యూజిలాండ్ టూర్ ముగియక ముందే కెప్టెన్ విరాట్ కోహ్లీ… విశ్రాంతి తీసుకోవడం టీమిండియాను కష్టాల్లోకి నెట్టేసింది. కోహ్లీ లేకుండా ఆడిన నాలుగో వన్డేల్లో చిత్తుగా ఓడిన రోహిత్ సేన.. చివరి వన్డేల్లో స్కోర్ చేయడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక.. మొదటి టీ20 మ్యాచ్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. జట్టులో 8మంది బ్యాట్స్‌మెన్లు ఉన్నా… ఒక్కరంటే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఫలితంగా టీ20ల్లోనే అతి పెద్ద ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో.. రెండో టీ20 మ్యాచ్‌కి ముందు ఒత్తిడిలో పడింది రోహిత్ గ్యాంగ్. ముఖ్యంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఉన్న రోహిత్… నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ చేజార్చుకుంటుండడం జట్టును ఆందోళనలోకి నెట్టేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

 

రెండో టీ 20 మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులిచ్చిన ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యాలకు తుది టీమ్‌లో చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. వీరి స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ జట్టులోకి రావడం గ్యారెంటీ. మిగిలిన స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్‌లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ భావిస్తున్నాడు. రోహిత్‌తో పాటు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియని మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ కూడా టీమిండియాను కలవరపెడుతోంది. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హర్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. రోహిత్ రాణించకపోయినా వీరు రాణిస్తే రెండో మ్యాచ్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కెప్టెన్ ఫామ్‌లోకి వస్తే ఆ కిక్ వేరేగా ఉంటుంది.

 

మొదటి టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ… ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది భారత జట్టు. వీరిలో దినేశ్ కార్తీక్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నా… చేతుల్లోకి వచ్చిన రెండింటిని జారవిడిచాడు. కాబట్టి దినేష్ కార్తిక్‌కు చోటు దక్కుతుందా.. లేదా అనేది అనుమానంగా మారింది. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మెన్ గప్టిల్ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన కివీస్ ఓపెనర్ టీమ్ సీఫర్ట్… అదరగొట్టాడు. 84 పరుగులు చేసి భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఇతనితో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా చెలరేగడంతో.. ఫస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. మొదటి మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహం కారణంగా కూల్‌గా రెండో మ్యాచ్‌ను ముగించాలని భావిస్తోంది కివీస్ టీమ్.