England vs India : మిథాలీ టీం రెడీ..భారత్ – ఇంగ్లాండ్ ఏకైక టెస్టు

భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.

England vs India : మిథాలీ టీం రెడీ..భారత్ – ఇంగ్లాండ్ ఏకైక టెస్టు

Team India

India Women’s Team : భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది. నాలుగు రోజుల పాటు ఈ టెస్టు మ్యాచ్ జరుగనుంది.

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మహిళల టీం ఇంగ్లాండ్ కు చేరుకుంది. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ ఫెవరేట్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఉమెన్ టీం 2014 సంవత్సరంలో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడింది. తర్వాత..వన్డే, టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడింది. మిథాలీ రాజ్ కెప్టెన్ ఆధ్వర్యంలో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన ఏడుగురు క్రికెటర్లు ప్రస్తుత టీమిండియాలో ఉన్నారు.

ఇంగ్లాండ్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఉమెన్ జట్టు..ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం చెందలేదు. ఓపెనర్ మంధానా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు. దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్, హర్మన్ క్రీత్ కౌర్, షెఫాలీ వర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరు ఎలాంటి ఆటను ప్రదర్శిస్తారనే ఉత్కంఠ నెలకొంది.