T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!

టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్‌ జట్టుకు దూరమయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.

T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!

England's Jason Roy Ruled Out Of T20 World Cup (1)

T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్‌ జట్టుకు దూరమయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్దానంలో జేమ్స్‌ విన్స్‌ జట్టులోకి చేరాడు. షార్జాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా రాయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రాయ్ తీవ్రమైన నొప్పితో కనీసం డ్రెస్సింగ్ రూం వరకు తనకు తానుగా నడిచివెళ్లలేకపోయాడు. చివరికి రాయ్ ఆటకు దూరమయ్యాడు.

ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడగా.. మొత్తంగా 123 పరుగులు నమోదు చేశాడు. ప్రపంచ కప్ నుంచి వైదొలిగాను.. చాలా బాధాకరమైనది.. అయినప్పటికీ నేను మా జట్టును సపోర్టు చేయడానికి ఇక్కడే ఉంటాను. మేం కచ్చితంగా ట్రోఫీని సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఇప్పటివరకూ ఈ టోర్నీలో మన ప్రయాణం చాలా అద్భుతమైనది. అదే ఉత్సాహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదిఏమైనా గాయం నుంచి నేను తొందరగా కోలుకుని వచ్చే ఏఢాదిలో ప్రారంభమయ్యే కరీబియన్ పర్యటనకు రెడీగా ఉంటాను’ అని రాయ్ తెలిపాడు.


నవంబర్ 10 (గురువారం) అబుధాబిలో న్యూజిలాండ్‌ ఇంగ్లండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ జరుగనుంది. ఇంగ్లండ్ జట్టులో జానీ బెయిర్ స్టోతో పాటు బట్లర్ టాప్ ఆర్డర్ లో ఆడనుండగా.. మిడిల్ ఆర్డర్ లో సామ్ బిల్లింగ్స్ ఆడే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో టెక్నికల్ కమిటీ రాయ్ స్థానంలో విన్స్ కు చోటు కల్పించింది.
Read Also : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు