Rohit Sharma: పాకిస్తాన్లో రోహిత్ శర్మ..!! షర్బత్ కోసం వెళ్లాడంటోన్న నెటిజన్లు
నెట్టింట్లో రోహిత్ శర్మ పాకిస్తాన్లో ఓ లోకల్ బండి దగ్గర కూర్చొని షర్బత్ తాగుతున్న ఫొటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆ ఫొటో పోస్టు చేసి తెగ కామెంట్ చేసేస్తున్నారు.
Rohit Sharma: నెట్టింట్లో రోహిత్ శర్మ పాకిస్తాన్లో ఓ లోకల్ బండి దగ్గర కూర్చొని షర్బత్ తాగుతున్న ఫొటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆ ఫొటో పోస్టు చేసి తెగ కామెంట్ చేసేస్తున్నారు ఇరు దేశాల క్రికెట్ అభిమానులు. నిజానికి ఆ ఫొటో ఎవరిదంటే.. ప్రపంచంలో ఒకే పోలికలు ఉన్న ఏడుగురు మనుషులు ఉంటారని విన్నాం కదా. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చూస్తున్నాం కూడా.
అచ్చు గుద్దినట్లు టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ లాగే కనిపించే వ్యక్తి పాకిస్తాన్ లో కనిపించాడు. దీంతో నెటిజన్లు ఆ ఫొటోతో మేమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ తలరాత మారడం లేదని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడంటూ ఒకరు కామెంట్ చేస్తుంటే.. ఇంకొకరు జాగ్రత్త రోహిత్ భాయ్ నువ్వు పాకిస్తాన్ లో ఉన్నావంటూ జాగ్రత్తలు చెప్తున్నారు.
………………………………………: సన్రైజర్స్ హైదరాబాద్కు డేవిడ్ వార్నర్ గుడ్బై
ఐపీఎల్ 2021 సెకండాఫ్లో మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒక్కదానిలోనూ విజయాన్ని నమోదు చేయలేదు. చెన్నైతో, కోల్కతాతో, బెంగళూరుతో అదే ఫలితాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా 8పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నెగెటివ్ రన్ రేట్తో కొనసాగుతుంది.