Womens T20 Challenge 2020: 47పరుగులకే ఆలౌట్

  • Published By: vamsi ,Published On : November 5, 2020 / 04:58 PM IST
Womens T20 Challenge 2020: 47పరుగులకే ఆలౌట్

Womens T20 Challenge: మహిళల టీ20(ఐపీఎల్) టోర్నీ 2020లో రెండో మ్యాచ్‌ షార్జా వేదికగా జరుగుతుండగా.. మిథాలి రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, కేవలం 47పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్ జట్టు రాణించడంతో.. వెలాసిటీ జట్టు పరుగులు చెయ్యడానికి కష్టపడింది.



మొదటి మ్యాచ్‌లో సూపర్‌నోవాస్ జట్టుపై సూపర్ విజయం సాధించిన మిథాలి సేన.. ట్రైల్‌బ్లేజర్స్‌ చేతిలో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలిరాజ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చెయ్యగలిగారు. ముగ్గరు డకౌట్‌లుగా పెవిలియన్ చేరగా.. ఒక్క పరుగు చేసి మరో ముగ్గురు అవుట్ అయ్యారు. స్టార్ క్రికెటర్ షఫాలి వర్మ కూడా 13పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.



https://10tv.in/dozens-to-be-deliberately-infected-with-coronavirus-in-uk-human-challenge-trials/
ట్రైల్‌బ్లేజర్స్‌ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు తీసుకోగా.. రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోసామి చెరో రెండు వికెట్లు, దీప్తీ శర్మ ఒక్క వికెట్ తీసుకున్నారు.



Velocity (Playing XI): షఫాలి వర్మ, డేనియల్ వ్యాట్, మిథాలి రాజ్ (కెప్టెన్), వేదా క్రిష్ణమూర్తి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), సూనే లూస్, శిఖా పాండే, సుశ్రీ దిమ్యదర్శిణిని, ఏక్తా బిష్త్, లీహ్ కాస్పెరిక్, జహానర ఆలమ్.



Trailblazers (Playing XI): స్మృతి మంధన (కెప్టెన్), డీండ్రా డాటిన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హెర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దయాలన్ హేమలత, నట్టకన్ చంతన్, సల్మా ఖుతాన్, సోఫీ ఎకిల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోసామి.