Hyderabad T20 Match: హైదరాబాద్లో టీమిండియా.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు నిర్ణయాత్మక చివరి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భారత క్రికెటర్లు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదట శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నక్రికెటర్లు అనంతరం హైదరాబాద్ లోనిహోటల్ పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు.
Hyderabad T20 Match: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు నిర్ణయాత్మక చివరి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భారత క్రికెటర్లు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మొదట శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నక్రికెటర్లు అనంతరం హైదరాబాద్ లోనిహోటల్ పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ తాజ్ కృష్ణలో బస చేశారు. ఇవాళ ఉప్పల్ లో జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది. భారత్ తొలి టీ20లో ఓడినప్పటికీ, నాగ్ పూర్ లో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిిందే.
దీంతో భారత్ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇవాళ మ్యాచ్ లో నెగ్గే జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పరిసరాలకు అభిమానులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ అంతా మ్యాచ్ సందడి నెలకొంది.
Nagpur ✅
Hello Hyderabad! ?#TeamIndia | #INDvAUS pic.twitter.com/gIey9Ncqm8
— BCCI (@BCCI) September 25, 2022