India Vs South Africa : దక్షిణాఫ్రికా టార్గెట్ 275 రన్లు, రాణించిన మంధాన, చివరిలో చెలరేగిన హర్మన్

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ...

India Vs South Africa : దక్షిణాఫ్రికా టార్గెట్ 275 రన్లు, రాణించిన మంధాన, చివరిలో చెలరేగిన హర్మన్

Icc Womens

ICC Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా సెమీస్ లో స్థానం కోసం భారత్ పోరాడుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్, షఫాలీ వర్మలు రాణించారు. వీరందరూ హాఫ్ సెంచరీలు సాధించడం.. చివరిలో హర్మన్ బ్యాట్ ఝులిపించడంతో భారత్ ఆ స్కోరైనా చేయగలిగింది. మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. దీంతో దక్షిణాప్రికా జట్టును ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Read More : IND Vs South Africa : భారత్ స్కోరు 108/2.. షఫాలీ హాఫ్ సెంచరీ

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ రనౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన యస్తిక ఎలాంటి పోరాటం చేయకుండా వెనుదిరిగారు. కేవలం ఆమె 2 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్..స్మృతి మంధానకు జత కలిశారు. వీరిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. అదుపు తప్పిన బంతులను బౌండరీలకు తరలించారు. స్కోరు బోర్డు పరుగులు పెట్టే విధంగా ఆడారు. వీరిని విడదీయడానికి దక్షిణాఫ్రికా మహిళా బౌలర్లు శ్రమించారు. ఈ తరుణంలో హాఫ్ సెంచరీ సాధించిన స్మృతి మంధాన.. సెంచరీ వైపుకు దూసుకెళ్లారు.

Read More : PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 176 వద్ద ఉన్నప్పుడు స్మృతి (71) అవుట్ అయ్యారు. అనంతరం మిథాలీ రాజ్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 68 పరుగుల వద్ద మిథాలీ అవుట్ అయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్, పూజాలు స్కోరును పెంచేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా చివరిలో హర్మన్ చెలరేగిపోయారు. పూజా (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. హర్మన్ కు రిచా సహకారం అందించారు. కానీ హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్న హర్మన్ (48) అవుట్ అయ్యారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మొత్తంగా భారత మహిళా టీం నిర్ణీత 50 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన 274 పరుగులు చేసింది. మరి దక్షిణాఫ్రికా ఈ టార్గెట్ ను కంప్లీట్ చేస్తుందా ? మిథాలీ సేన సెమీస్ కు వెళుతుందా ? అనేది కాసేపట్లో తేలనుంది.