తొలి టీ20లో గెలుపు మనదే, మ్యాచ్ తిప్పేసిన చాహల్

తొలి టీ20లో గెలుపు మనదే, మ్యాచ్ తిప్పేసిన చాహల్

ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లో తొలి విజయం నమోదు చేసుకుంది టీమిండియా. తొలి టీ20లో భాగంగా తలపడిన మ్యాచ్ లో 11పరుగుల తేడాతో ఆసీస్ ను గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 161పరుగులు చేయగా చేధనలో తడబడ్డ ఆసీస్.. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు నష్టపోయి 150పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ విజయం బౌలర్లదేనని చెప్పాలి. స్పిన్నర్ చాహల్, నటరాజన్ తలో 3వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు తీయకుండా కట్టడి చేశారు. చాహర్ ఒక వికెట్ తీయగలిగాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (35), డార్సీ షార్ట్ (34)లు మాత్రమే అత్యధిక స్కోరు నమోదు చేయగలిగారు.



అంతకంటే ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓ మాదిరి స్కోరు నమోదు చేసి ఆసీస్‌కు 162పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చివర్లో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా(44: 23 బంతుల్లో 5ఫోర్లు, సిక్సు)లతో జట్టును ఆదుకోవడంతో నామమాత్రపు స్కోరు నమోదు చేయగలిగింది.

శిఖర్ ధావన్(1), విరాట్ కోహ్లీ(9), సంజూ శాంసన్(23), మనీశ్ పాండే(2), హార్దిక్ పాండ్యా(16), వాషింగ్టన్ సుందర్(7), దీపక్ చాహర్(0)లు ఆడగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి క్రీజులో చాహర్, జడేజాలు ఉండి ఇన్నింగ్స్ పూర్తి చేయగలిగారు. మిచెల్ స్టార్క్ 2, హెన్రిక్స్ 3వికెట్లు పడగొట్టగా ఆడం జంపా, మిచెల్ స్వెప్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.