INDvsENG: రోజంతా టీమిండియాదే ఆధిపత్యం

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా పూర్తి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రోహిత్ సెంచరీకి మించిన స్కోరు, పూజారా హాఫ్ సెంచరీకి ధాటిన స్కోరుతో స్కోరు బోర్డును....

INDvsENG: రోజంతా టీమిండియాదే ఆధిపత్యం

Team India

INDvsENG: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా పూర్తి రోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రోహిత్ సెంచరీకి మించిన స్కోరు, పూజారా హాఫ్ సెంచరీకి ధాటిన స్కోరుతో స్కోరు బోర్డును పరుగులుపెట్టారు. శనివారం జరిగిన మూడు సెషన్లు పూర్తి అయ్యే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, 1 సిక్స్‌)నిలబడి సెంచరీతో కదంతొక్కితే… చతేశ్వర్‌ పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లి – జడేజాలు ఒక సెషన్ అంతా నిలబడటంతో తర్వాతి రోజున రహానె, రిషభ్‌ పంత్, శార్దుల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్‌ శాసించే స్థితికి చేరుకుంటుంది.

శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 43/0తో ఆటను కొనసాగించిన ఓపెనర్లను ఇంగ్లండ్‌ పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అండర్సన్‌ ఇంగ్లండ్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్‌… అండర్సన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్‌ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించగా మొయిన్‌ అలీ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదిన రోహిత్‌ 204 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు.

టెస్టుల్లో విదేశీ గడ్డపై రోహిత్‌కిదే తొలి సెంచరీ కాగా… ఓవరాల్‌గా టెస్టుల్లో అతడికిది ఎనిమిదో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా రోహిత్‌ టెస్టుల్లో 3వేల పరుగులను పూర్తి చేశాడు. మరోవైపు పూజారా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. రూట్‌ కొత్త బంతిని తీసుకుని రాబిన్సన్‌ను బౌలింగ్‌కు పిలిచాడు. కెప్టెన్‌ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాబిన్సన్‌… 81వ ఓవర్‌లో రోహిత్, పుజారాలను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌కు డబుల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. లైట్ కోల్పోయే సమయానికి 13 ఓవర్లు ఉండగానే ఆటను ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290