IND vs NZ: మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మకు షాక్.. పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీ

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. రెండో విజయం నమోదు చేసుకున్న రోహిత్ సేన 153పరుగుల లక్ష్యాన్ని చేధించి 7వికెట్ల తేడాతో గెలిచేసింది. ఈ మ్యాచ్ లో...

IND vs NZ: మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మకు షాక్.. పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీ

Rohit Shamra

lamnd: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. రెండో విజయం నమోదు చేసుకున్న రోహిత్ సేన 153పరుగుల లక్ష్యాన్ని చేధించి 7వికెట్ల తేడాతో గెలిచేసింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ కోసం స్టేడియంలోకి దూసుకొచ్చాడు ఓ అభిమాని. అంతే ఒక్కసారిగా రోహిత్ షాక్..

దూసుకొచ్చిన వ్యక్తిని చూసి షాక్ నుంచి తేరుకునే లోపే కాళ్ల మీద పడిపోయాడు. అతణ్ని పట్టుకునేందుకు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లని చూడగానే పడిన వాడు లేచి మళ్లీ తన సీట్ దగ్గరకు పరుగుతీశాడు. సెక్యూరిటీ వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు.

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన న్యూజిలాండ్‌ ఆరంభంలో ధాటిగా ఆడి చివర్లో చేతులెత్తేసింది. గఫ్తిల్‌(31), డారిల్‌ మిచెల్‌(31), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) రాణించడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

…………………………… : చిత్తూరు జిల్లాకు రూ.500 కోట్ల నష్టం

అనంతరం లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు రాహుల్‌(65), రోహిత్‌ (55)శర్మ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తరువాత వరుస బంతుల్లో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లక్ష్యాన్ని పూర్తి చేశారు. భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నట్లు అయింది.