Ind Vs WI : రెండో టీ20లో విండీస్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. సిరీస్ కైవసం
వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.

Ind Vs WI : వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో వూరన్(62), పావెల్(68*) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరి జోడీ 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
Sakibul Gani : తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. బీహార్ కుర్రాడి వరల్డ్ రికార్డ్
వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. పరుగుల వరద పారించారు. వీరి జోరు చూస్తే ఒకానొక సమయంలో టీమిండియాకు ఓటమి తప్పదని అనిపించింది. అయితే 19వ ఓవర్లలో భువనేశ్వర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన వూరన్ ను ఔట్ చేశాడు. చివరిలో ఓవర్ లో 25 పరుగులు చేయాల్సి ఉండగా విండీస్ 16 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. విండీస్ ముందు 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (52), రిషభ్ పంత్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
Sachin Tendulkar: తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడని సచిన్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ( 41 బంతుల్లో 52 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 49/1 స్కోరుతో నిలిచింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (18) 8వ ఓవర్లో బ్రెండన్ కింగ్కి చిక్కి పెవిలియన్ చేరాడు.
కొద్ది సేపటికే సూర్యకుమార్ యాదవ్ (8) కూడా రోస్టన్ ఛేజ్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (52), వెంకటేశ్ అయ్యర్ (33) ధాటిగా ఆడారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు తీశాడు. షెల్డన్ కాట్రెల్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది.
- IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
- IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే
- Sourav Ganguly: విరాట్, రోహిత్ల ఫామ్పై బేఫికర్ అంటోన్న గంగూలీ
- IPL2022 KKR Vs MI : కోల్కతాను బెంబేలెత్తించిన బుమ్రా.. ముంబై టార్గెట్ ఎంతంటే..
- IPL2022 SRH Vs DC : అరదగొట్టిన ఢిల్లీ.. హైదరాబాద్కు హ్యాట్రిక్ ఓటమి
1PM Modi: పరేడ్ గ్రౌండ్కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..
2Maharashtra: రెండున్నరేళ్ళ క్రితం ఫడ్నవీస్ చెవిలో ఈ విషయం చెప్పాము: అసెంబ్లీలో ఆదిత్య ఠాక్రే
3Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
4Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట
5WhatsApp: వాట్సప్ ఆన్లైన్లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు
6Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
7Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?
8BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటిలెజెన్స్ పోలీసులు
9Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
10PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్కు కమలనాథుల ప్లాన్
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్