Ind vs Windies: తొలి వన్డేలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్

టీమిండియాతో శనివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా ఆడనున్నట్లు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి..

Ind vs Windies: తొలి వన్డేలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్

Rohith Sharma

Ind vs Windies: టీమిండియాతో శనివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా ఆడనున్నట్లు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి హాజరుకానున్నాడు.

ఇదిలా ఉంటే శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ లు కొవిడ్ పాజిటివ్ కారణంగా అహ్మదాబాద్ లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్ లోనే కొనసాగుతుండటంతో ఇషన్ కిషన్ ను తొలి గేమ్ లో ఓపెనర్ గా ఆడించనున్నాడు రోహిత్ శర్మ.

మీడియా కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ ‘మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్ లోనే ఉండాల్సి వచ్చింది. మాకున్న ఏకైక ఆప్షన్ ఇషాన్ కిషన్ మాత్రమే. గాయం ఉన్నప్పటికీ ఇవాళ ట్రైనింగ్ లో పాల్గొన్నాం’ అని రోహిత్ శర్మ శనివారం మీడియాతో అన్నారు.

Read Also: హైదరాబాద్ లో ప్రధాని మోదీ 

అంతకంటే ముందు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మయాంక్ అగర్వాల్ ను టీమిండియా వన్డే స్క్వాడ్ లో చేర్చింది. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీలకు కొవిడ్ పాజిటివ్ రావడంతో మార్పులు తప్పలేదు. వారంతా ప్రస్తుతం అహ్మదాబాద్ లోనే ఐసోలేషన్ లో ఉన్నారు.