India History : 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘనవిజయం.. వన్డే క్రికెట్ హిస్టరీలో భారత్ రికార్డ్

లంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. వన్డే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరిట ఉంది.

India History : 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘనవిజయం.. వన్డే క్రికెట్ హిస్టరీలో భారత్ రికార్డ్

India History : శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుస విజయాలతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్ లో లంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. వన్డే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం.

ఇప్పటివరకు ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును టీమిండియా తిరగరాసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా(275), సౌతాఫ్రికా(272), సౌతాఫ్రికా(258), భారత్(257) అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్లుగా ఉన్నాయి. టాప్ 6 లో భారత్, సౌతాఫ్రికా రెండు సార్లు ఉండటం విశేషం.

ఇక మూడో వన్డేలో భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో శ్రీలంకను బెంబేలెత్తించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన అషేన్ బండార బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో అతడిని అబ్సెంట్ హర్ట్ గా పరిగణించారు.

లంక జట్టు కేవలం 22 ఓవర్లు మాత్రమే ఆడింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 19, కసున్ రజిత 13 (నాటౌట్), కెప్టెన్ దసున్ షనక 11 పరుగులు చేశారు. చివరి మ్యాచ్ లోనూ గెలుపుతో వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.

మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ శతకంతో చెలరేగారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగుల భారీ స్కోర్ చేసింది.

కోహ్లీ తన క్లాస్, మాస్ ఆటను చూపిస్తూ లంక బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ స్కోర్ లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్ మాన్ గిల్ (116) సెంచరీ కొట్టగా, ఆ తర్వాత కోహ్లీ దెబ్బకు లంక బౌలర్లు మరింత బెంబేలెత్తిపోయారు.