IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఆడే భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. అతడు ఎవరో కాదు.. జట్టు కెప్టెన్సీగా శిఖర్ ధావన్‌కు బాధ్యతలు స్వీకరించనున్నాడు.

IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!

India Squad For Odi Series Against West Indies Announced, Shikhar Dhawan To Captain

IND vs WI : వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఆడే భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. అతడు ఎవరో కాదు.. జట్టు కెప్టెన్సీగా శిఖర్ ధావన్‌కు బాధ్యతలు స్వీకరించనున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌కి సంబంధించిన టీమిండియా జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వెస్టిండీస్ పర్యటనలో జట్టు కీలక సీనియర్, మల్టీ-ఫార్మాట్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పేర్లు వినిపిస్తున్నాయి.

శుభమాన్ గిల్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ట్రినిడాడ్‌లో జులై 22న వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌లతో ఐదు T20Iలను కూడా ఆడనున్నారు. చివరి రెండు టీ20లు ఆగస్టు 6, 7 తేదీల్లో అమెరికాలో జరగనున్నాయి. ట్రినిడాడ్, సెయింట్ కిట్స్, లాడర్‌హిల్ (ఫ్లోరిడా)లో మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్టు 6, 7 తేదీల్లో అమెరికా, కరేబియన్‌లో జరగనున్నాయి.


భారత జట్టు (అంచనా) :
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్షీద్ సింగ్, అవేష్ ఖాన్.

Read Also : Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్