India T20 Squad : భారత్ – న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు కెప్టెన్గా రోహిత్ శర్మ.. జట్టును ప్రకటించిన బీసీసీఐ..
న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన
India T20 Squad : టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ తిరుగు ప్రయాణం అయింది. ఇక నెక్స్ట్ కివీస్ తో జరగనున్న టీ20 సిరీస్ పై దృష్టి పెట్టబోతోంది టీం ఇండియా. న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
RCB Head Coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్
ఈ సిరీస్ లో టీం ఇండియా కెప్టెన్గా రోహిత్ శర్మని ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను నియమించారు. కోహ్లీ, జడేజా, షమీ, బుమ్రాలు విశ్రాంతి తీసుకోనున్నారు.
కివీస్ సిరీస్ కి ఎంపికైన భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
T20 World Cup 2021: కోహ్లీ.. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ వదలకూడదు – వీరేంద్ర సెహ్వాగ్
టీ20 సిరీస్ షెడ్యూల్:
నవంబర్ 17న మొదటి టీ20 మ్యాచ్ – జైపూర్
నవంబర్ 19న రెండో టీ20 మ్యాచ్ – రాంచీ
నవంబర్ 21న మూడో టీ20 మ్యాచ్ – కోల్కత్తా
NEWS – India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India.
More details here – https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB
— BCCI (@BCCI) November 9, 2021