India T20 Squad : భారత్ – న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు కెప్టెన్‎గా రోహిత్ శర్మ.. జట్టును ప్రకటించిన బీసీసీఐ..

న్యూజిలాండ్‎తో జరిగే సిరీస్‎కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన

India T20 Squad : భారత్ – న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు కెప్టెన్‎గా రోహిత్ శర్మ.. జట్టును ప్రకటించిన బీసీసీఐ..

Rohit

India T20 Squad :  టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ తిరుగు ప్రయాణం అయింది. ఇక నెక్స్ట్ కివీస్ తో జరగనున్న టీ20 సిరీస్ పై దృష్టి పెట్టబోతోంది టీం ఇండియా. న్యూజిలాండ్‎తో జరిగే సిరీస్‎కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో భారత్ 3 టీ20లు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్ కి సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

RCB Head Coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్

ఈ సిరీస్ లో టీం ఇండియా కెప్టెన్‎గా రోహిత్ శర్మని ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్‎గా కేఎల్ రాహుల్‎ను నియమించారు. కోహ్లీ, జడేజా, షమీ, బుమ్రాలు విశ్రాంతి తీసుకోనున్నారు.

కివీస్ సిరీస్ కి ఎంపికైన భారత టీ20 జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.

T20 World Cup 2021: కోహ్లీ.. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ వదలకూడదు – వీరేంద్ర సెహ్వాగ్
టీ20 సిరీస్ షెడ్యూల్:

నవంబర్ 17న మొదటి టీ20 మ్యాచ్ – జైపూర్
నవంబర్ 19న రెండో టీ20 మ్యాచ్ – రాంచీ
నవంబర్ 21న మూడో టీ20 మ్యాచ్ – కోల్‎కత్తా