India vs Afghanistan: టీమిండియా స్కోరు 6 ఓవర్లకు 52 పరుగులు.. కేఎల్ రాహుల్ సారథ్యంలో ఆడుతోన్న భారత్
దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లకు 33 పరుగులుగా ఉంది. సూపర్-4లో పాక్, శ్రీలంకతో ఓడిపోయిన భారత్ ఫైనల్ వెళ్ళే అవకాశాలను చేజార్చుకున్న విషయం తెలిసిందే.
India vs Afghanistan: దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 6 ఓవర్లకు 52 పరుగులుగా ఉంది. సూపర్-4లో పాక్, శ్రీలంకతో ఓడిపోయిన భారత్ ఫైనల్ వెళ్ళే అవకాశాలను చేజార్చుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, అఫ్గానిస్థాన్ కూడా ఫైనల్ వెళ్లే అవకాశాలు లేవు. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్నది నామ మాత్రపు మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్ను టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో కాకుండా కేఎల్ రాహుల్ సారథ్యంలో ఆడుతోంది. భారత జట్టులో కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, దీపక్ హూడా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్, దీపక్ చాహర్ ఉన్నారు.