INDvsBAN: ముగ్గురు ఫేసర్లతో బరిలోకి కోహ్లీసేన!

INDvsBAN: ముగ్గురు ఫేసర్లతో బరిలోకి కోహ్లీసేన!

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు భారత్ మరోసారి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశ్రాంతి నుంచి విరాట్ కోహ్లీ నేరుగా ప్రాక్టీస్ క్యాంపుకు చేరుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆడనున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడాడు. 

ప్రపంచంలోనే అత్యుత్తమ సీమర్లు ఉన్న జట్టు తమదేనని ఈ మ్యాచ్ లో ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కోహ్లీ వెల్లడించాడు. ‘మీరు నన్ను అడిగితే ఒకటే చెబుతాను. ఈ చాంపియన్‌షిప్‌లో మేమే టాప్ స్థానంలో ఉన్నాం. కెప్టెన్‌గా ఇన్నింగ్స్ మొదలైనప్పటి నుంచి మన ఫేసర్లు ప్రపంచ క్రికెట్ ను శాసించాలనే అనుకున్నా. బ్యాటింగ్, స్పిన్ అంశాలు ఎప్పుడూ సమస్య కాలేదు. స్టార్ క్రికెటర్లంతా వెళ్లిపోయారు. టెస్టు క్రికెట్లో 20వికెట్లు ఎలా పడగొట్టాలని తలెత్తిన ప్రశ్నకు సమాధానమే ఫేస్ బౌలింగ్’

‘ఎలాంటి పిచ్ అయినా, ప్రత్యర్థి జట్టు ఏదైనా ఊహించినదాని కంటే ఎక్కువగానే సాధించాం. ఇప్పటికీ మన ఫేసర్ల ఆకలి తీరలేదు. జట్టుగా పోరాడటానికి ఇష్టపడుతున్నారు. వాళ్లే మన ప్రధాన బలం. పిచ్ స్వభావం చూస్తుంటే ఫేస్ బౌలింగ్ ప్రధాన ఎంపికగా అనిపిస్తుంది. బుమ్రా ఫిట్ గా లేకపోవడంతో షమీ, ఉమేశ్, ఇషాంత్ తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి’ అని కోహ్లీ తెలిపాడు.