ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టు : మొదటి రోజు ముగిసిన ఆట : కోహ్లీసేన స్కోరు 24/1

ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టు : మొదటి రోజు ముగిసిన ఆట : కోహ్లీసేన స్కోరు 24/1

India vs England Final 4th Test : అహ్మదాబాద్ టెస్టు : అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి నాల్గోటెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. పుజారా 15, రోహిత్ శర్మ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లుగా శుభ్ మాన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగగా.. గిల్ (0) ఆదిలోనే చేతులేత్తేశాడు.

గిల్ స్థానంలో చతేశ్వర పూజారా క్రీజులోకి వచ్చాడు. 4.1 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ డ్రా చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 181 పరుగులతో భారత్ వెనుకంజలో ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు చాప చుట్టేసింది. భారత బౌలర్ అశ్విన్‌ వేసిన 75.5 బంతికి జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1×4) 7 పరుగులతో ఎల్బీగా వెనుదిరిగాడు.


ఇక అండర్సన్‌ (10) నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లారెన్స్ 46 పరుగులు చేయగా, పోప్ 29, జానీ బెయిర్ స్టో 28 పరుగులు చేశారు.