T20 World Cup 2022: భారత్-పాక్‌ మ్యాచులో కోహ్లీ కొట్టిన సిక్సుల వీడియో వైరల్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. ఈ మ్యాచును కోహ్లీ గెలిపించిన తీరును టీమిండియా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.

T20 World Cup 2022: భారత్-పాక్‌ మ్యాచులో కోహ్లీ కొట్టిన సిక్సుల వీడియో వైరల్

Cine Celebrities Tweets on Kohli

T20 World Cup 2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. ఈ మ్యాచును కోహ్లీ గెలిపించిన తీరును టీమిండియా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు.

ఆ మ్యాచులో విరాట్ కోహ్లీ హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులకు సంబంధించిన దృశ్యాలను స్లో మోషన్ లో చూపిస్తూ ఒకరు ట్వీట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. కాగా, ఇవాళ టీమిండియా టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్ తో మ్యాచు ఆడుతోంది. నెదర్లాండ్ చిన్నజట్టు కావడంతో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..