ఉప్పల్‌లో మ్యాచ్: బౌలింగ్ ఎంచుకున్న భారత్

ఉప్పల్‌లో మ్యాచ్: బౌలింగ్ ఎంచుకున్న భారత్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో వరకూ భారత్.. వెస్టిండీస్‌ను 14 సార్లు ఢీకొనగా.. 8 మ్యాచ్‌ల్లో గెలిచి ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఒక టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇటీవల ముగిసిన మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న భారత్ మంచి ఊపుమీదుంది.

మరోవైపు పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో 1-2తో టీ20 సిరీస్‌లో ఓడిపోయిన వెస్టిండీస్ నిలదొక్కుకు నేందుకు ప్రయత్నిస్తుంది.టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండగా.. శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడబోతున్నాడు. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లో కనిపిస్తుండగా.. కొన్ని సిరీస్‌లుగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా లయ అందుకోవాలని ఆశిస్తున్నాడు.

దీపక్ చాహర్ ఇటీవల హ్యాట్రిక్ వికెట్లతో జోరుమీద కనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ శివమ్ దూబె కూడా టీ20 వరల్డ్‌కప్ ముంగిట సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. సంజు శాంసన్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మనీశ్ పాండేలకి భారత తుది జట్టులో అవకాశం దక్కలేదు.

West Indies: Lendl Simmons, Evin Lewis, Brandon King, Shimron Hetmyer, Kieron Pollard(c), Denesh Ramdin(w), Jason Holder, Hayden Walsh, Sheldon Cottrell, Kesrick Williams, Khary Pierre

India : Rohit Sharma, Lokesh Rahul, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Shivam Dube, Washington Sundar, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Deepak Chahar, Yuzvendra Chahal