IND vs SA T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది.

IND vs SA T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా

IND vs SA T20: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్‪‌కు ఇది నామమాత్రపు మ్యాచే.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

దీంతో ఈ మ్యాచ్ కోసం ఇండియా మూడు కీలక మార్పులు చేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చిన జట్టు.. వారి స్థానంలో శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించింది. మరోవైపు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ధాటిగా ఆడుతోంది. ఆరు ఓవర్లలో 48 పరుగులు సాధించిన సౌతాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఇప్పటికే వరుస ఓటములతో ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచులోనైనా నెగ్గాలని భావిస్తోంది. వరుసగా మూడు మ్యాచులు గెలిచి ప్రపంచ కప్‌లో విజయోత్సాహంతో అడుగుపెట్టాలని ఇండియా భావిస్తోంది.