వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్..

వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్..

నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో సిరీస్‌లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(2019-21) ఫైనల్‌కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలోకి వచ్చింది.

వరుస రెండు పరాజయాలతో ఇంగ్లండ్‌ ఏ మార్పు లేకుండా నాలుగో స్థానానికి పరిమితం అయ్యింది. న్యూజిలాండ్‌ 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆ దేశ దాయాది జట్టు ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.