మీకు బుద్ధి ఉందా? : పాక్ మద్దుతుగా కరోనాపై భారత క్రికెటర్ల ప్రచారం.. నెటిజన్లు ఫైర్
భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేయాలంటూ పాకిస్థాన్ కెప్టెన్ షాహీది అఫ్రిది నిర్వహించే సంస్థకు మద్దతుగా నిలిచిన వీరిద్దరిని నెటిజన్లు ఏకిపారేశారు. ఇరుదేశాల ప్రత్యర్థుల్లో ఈ ఇద్దరి చర్యతో భగ్గుమంది.
పాకిస్థాన్ లో ప్రాణాంతక వైరస్ బాధితుల సహాయార్థం విరాళాలు అభ్యర్థిస్తున్న అఫ్రిధికి ఈ ఇద్దరు క్రికెటర్లు మద్దతుగా ప్రచారం చేశారు. హర్భజన్ వీడియో మెసేజ్ ద్వారా విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరాడు. రెండు దేశాల్లోని ఇతర క్రికెటర్లను కూడా ఇలానే కోరాడు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా ట్విట్టర్ వేదికగా అప్రిధికి తన మద్దుతు తెలిపాడు.
The world is passing through extremely testing and unprecedented times.Let’s do our bit to help @SAfridiOfficial @SAFoundationN doing gr8 work plz join hands with them nd contribute what ever u can https://t.co/t9OvfEPp79 for covid19 @wasimakramlive @YUVSTRONG12 @shoaib100mph pic.twitter.com/sB2fxCAQqY
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 29, 2020
ఇవి పరీక్షా కాలం.. ప్రతిఒక్కరూ జాగ్త్రత్తగా ఉండాల్సిన సమయం’ అని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన యువరాజ్, హర్భజన్లకు ప్రత్యర్థి ఆటగాడైన అఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు.
These are testing times, it’s time to lookout for each other specially the ones who are lesser fortunate. Lets do our bit, I am supporting @SAfridiOfficial & @SAFoundationN in this noble initiative of covid19. Pls donate on https://t.co/yHtpolQbMx #StayHome @harbhajan_singh pic.twitter.com/HfKPABZ6Wh
— yuvraj singh (@YUVSTRONG12) March 31, 2020
యువరాజ్, హర్భజన్ల తీరుపై భారత్ లో ట్విట్టర్ యూజర్లు మండిపడ్డారు.. ‘నీకు ఏమైనా బుద్ధి ఉందా? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. నీపై ఉన్న గౌరవం పోయిందంటూ భజ్జీని తిట్టిపోశాడు మరో యూజర్. మరొకరు సారీ గాయ్స్.. మీరు కోల్పోయారు.. అని ట్వీట్ చేశారు.
Ask him to take care of Hindus too who live in Pakistan without any discrimination ??
— Bhaskar ಭಾಸ್ಕರ್?? (@Bhaskarsri) March 31, 2020
2012-2013 నుంచి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకూ ద్వైపాక్షిక సిరీస్ జరుగలేదు. వరల్డ్ కప్ విజేత, బ్యాట్స్ మెన్ యువరాజ్, గత ఏడాదిలో క్యాన్సర్ ను జయించి తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. తన YouWeCan ఫౌండేషన్ ద్వారా కరోనా వైరస్ సంక్షోభంపై విరాళాలను కూడా కోరాడు. మార్చి 24 నుంచి భారతదేశంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 1,600మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 38 మంది వైరస్ సోకి మృతిచెందారు.
Donate to Shahid Afridi foundation?? Thik toh ho paaji?
— Krishna (@Itskrishna_k) March 31, 2020
పాకిస్థాన్ లో కరోనా బాధితుల కోసం విరాళాలు కోరుతున్న అఫ్రిదికి మద్దుతు తెలపడంపై వస్తున్న విమర్శలపై యువీ స్పందించాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఏ తప్పు ఉందో నాకు నిజంగా అర్థం కావడం లేదని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపాడు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్నాడు. నేను ఎప్పుడు భారతీయుడినే.. బ్లూతోనే ఉంటాను.. మానవత్వాన్ని చాటేందుకు ఎల్లప్పడూ నిలబడతా.. జైహింద్ అంటూ యువీ పోస్టు పెట్టాడు.