Cyclist Meenakshi: కామన్వెల్త్ గేమ్స్లో గాయపడ్డ భారత సైక్లిస్ట్ .. వీడియో వైరల్
బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్స్ సత్తాచాటుతున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే మీనాక్షి సైకిల్ పైనుంచి జారిపడింది.
Cyclist Meenakshi: బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్స్ సత్తాచాటుతున్నారు. పతకాల వేటలో నిమగ్నమయ్యారు. గేమ్స్ లో భాగంగా సోమవారం సైక్లింగ్ లో 10 కి.మీ స్ర్కాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే మీనాక్షి సైకిల్ పైనుంచి జారిపడింది.
Commonwealth Games: పాక్పై 8 వికెట్ల తేడాతో టీమిండియా అమ్మాయిల గెలుపు
దీంతో వేగంగా ట్రాక్ అంచుకు దూసుకెళ్లింది. అదే సమయంలో ఆమె వెనుకే వేగంగా దూసుకొచ్చిన న్యూజీల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా కిందపడ్డ మీనాక్షిని తప్పించలేక పోయింది. మీనాక్షి మీద నుంచి సైకిల్ ను పోనిచ్చి ఆమెసైతం కిందపడింది. వెంటనే మెడిక్స్ రంగంలోకిదిగి మీనాక్షి, బోథా ఇద్దరికీ ప్రాథమిక చికిత్స అందించారు.
Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82
— Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022
ప్రమాదానికి గురైన ఇద్దరు సైక్లిస్టుల ను రేసు నుంచి పక్కకు తీసుకెళ్లారు. మీనాక్షికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్ట్రెచర్ పై చికిత్స అందించేందుకు తీసుకెళ్లారు. అయితే ఈ ఈవెంట్ లో ఇంగ్లండ్ కు చెందిన లారా కెన్సీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మీనాక్షీ ప్రమాదానికి గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.