4వ వన్డేలో భారత బ్యాటింగ్, ధావన్ విజృంభణ

4వ వన్డేలో భారత బ్యాటింగ్, ధావన్ విజృంభణ

కీలకమైన వన్డే టోర్నీలో భారత్-ఆసీస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. పంజాబ్ లోని మొహాలి వేదికగా జరుగుతోన్న 4వ వన్డేలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోతున్నారు. 18 ఓవర్లు వరకూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా రోహిత్(41), ధావన్(60)పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. 

టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా ముంగిట భారీ టార్గెట్ ఉంచాలని చూస్తోంది. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీకి బదులు రిషబ్ పంత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇదొక్కటి మినహాయించి జట్టులో మార్పులేవీ లేకుండానే కోహ్లీసేన బరిలోకి దిగింది. 

టీమిండియా: 
శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, లోకేశ్ రాహుల్