ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్

ధోనీ గిఫ్ట్ కోసం టీమిండియా కసరత్తులు, సిక్సుల చాలెంజ్

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో రెండు వన్డేలు ముగించుకున్న టీమిండియా మూడో వన్డే కోసం పోరాడేందుకు సమాయత్తమైంది. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం బుధవారమే అక్కడి చేరుకుంది టీమిండియా. ధోనీ సహచరులందరికీ తన ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేశాడు. సిరీస్ కైవసం చేసుకోవాలనే ఆరాటంలో కనిపిస్తున్న టీమిండియా రాంచీ మైదానంలో తీవ్రంగా ప్రాక్టీసులో పాల్గొంది. 
Also Read : అదేంటి: జార్ఖండ్‌కు పరాయివాడ్ని చేయొద్దంటోన్న ధోనీ

ఓపెనర్లు స్థానంలో సందిగ్ధంలో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్ ధావన్‌కు బదులు కేఎల్ రాహుల్‌కు స్థానం కల్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ స్టేడియం వేదికగా ధోనీ ఆడుతున్న ఆఖరి మ్యాచ్ అనే సమాచారం వినిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ధోనీకి ఈ విజయాన్ని కానుకగా ఇవ్వాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. 

ప్రాక్టీస్ సెషన్ మొత్తం సరదాసరదాగా సాగింది. ఈ వీడియోలను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. దానికి సరదా సిక్సుల చాలెంజ్ అనే హెడ్డింగ్ పెట్టి పోస్టు చేసింది. ఈ చాలెంజ్‍‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేయగా ధోనీ, రిషబ్ పంత్, జడేజా, చాహల్, కేదర్ జాదవ్‌లు పాల్గొన్నారు. ఎవరు కొట్టిన సిక్సు దూరంగా వెళ్లిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి.
Also Read : పాక్ బౌలర్ గ్రేట్ అంటోన్న శిఖర్ ధావన్