టీమిండియా టార్గెట్ 237

టీమిండియా టార్గెట్ 237

హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పరవాలేదనిపించారు. ఈ మేర భారత్ కు 7 వికెట్లు కోల్పోయి 240 పరుగుల టార్గెట్ ను నిర్దేశించగలిగారు. భారత బౌలింగ్ విభాగం బాగా పనిచేయడంతో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు. చాలావరకూ మ్యాచ్ మొత్తం సింగిల్స్ మీదనే స్కోరు బోర్డు నడిచింది. మొత్తం మీద 2 సిక్సులు, 26 ఫోర్లు మాత్రమే చేయగలిగారు.

ఆసీస్ జట్టు మొత్తంలో ఉస్మాన్ ఖవాజా(50) మాత్రమే 76 బంతులాడి అత్యధిక స్కోరు నమోదు చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో టీ20లో చెలరేగి ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్(40) మీద నిలుపుకున్న ఆశలు నిలబెట్టుకోలేకపోయాడు. పీటర్ హ్యాండ్స్ కాంబ్(19), ఆస్టన్ టర్నర్ (21), అలెక్స్ క్యారీ(36), కౌల్టర్ నైల్(28), పాట్ కమిన్స్(0) పరుగులు చేయగలిగారు.

కంగారూలపై రెచ్చిపోయిన భారత బౌలర్లు కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 2, కేదర్ జాదవ్ 1, కుల్దీప్ యాదవ్ 2 తీయగలిగారు.  వికెట్లు పడగొట్టలేకపోయినా పరుగుల విషయంలో మాత్రం అదుపుచేయగలిగారు. బుమ్రా బౌలింగ్ లో మాత్రమే బౌండరీలు చేసేందుకు ఆసీస్ బ్యాట్స్ మెన్ కు చక్కటి అవకాశాలు దక్కాయి.