కట్టడి చేసిన భారత్.. ఆస్ట్రేలియా స్కోరు 272
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న ఐదో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియాను ఎట్టకేలకు కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత్కు 273 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. దూకుడుగా ఆడుతూ శుభారంభాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్ను అదే స్థాయిలో కొనసాగించలేకపోయింది.
దూకుడు మీదున్న ఆసీస్కు రవీంద్ర జడేజా బ్రేక్ వేశాడు. 14.3 ఓవర్లకు 76 పరుగుల వద్ద తొలి వికెట్గా ఆరోన్ ఫించ్(27; 43 బంతుల్లో 4 ఫోర్లు)ను పడగొట్టాడు. ఆ తర్వాత సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా(100)ను 32.6 ఓవర్లకు 175 పరుగుల వద్ద కోహ్లీ క్యాంచ్ అందుకోవడంతో భువీ బౌలింగ్లో మరో వికెట్ పడింది.
Read Also : కట్టడి చేసిన భారత్.. ఆస్ట్రేలియా స్కోరు 272
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన గ్లెన్ మ్యాక్స్వెల్(1)ను మరో వికెట్గా రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు. దాంతో ఊపందుకున్న భారత్.. ఆసీస్ను వికెట్లను వరుసగా పడగొట్టింది. పీటర్ హ్యాండ్స్కాంబ్(52), ఆష్టన్ టర్నర్(20), మార్కస్ స్టోనిస్(20), అలెక్స్ క్యారీ(3), పాట్ కమిన్స్(15), రిచర్డ్సన్(29)లుగా కట్టడి చేయడంతో 272 పరుగులు చేయగలిగింది.
ఖవాజా మరో సారి సెంచరీ:
కెరీర్ ఆరంభం నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని ఉస్మాన్ ఖవాజా భారత్ పర్యటనలోనే తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 107బంతులు ఆడి సెంచరీ చేసిన ఖవాజా… ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న 4వ వన్డేలోనూ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ చేసి అద్భుతహ అనిపించాడు.
Read Also : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి