INDvsBAN: కోహ్లీ డకౌట్, సెంచరీకి చేరువలో మయాంక్

INDvsBAN: కోహ్లీ డకౌట్, సెంచరీకి చేరువలో మయాంక్

ఇండోర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా బ్యాటింగ్ కు దిగి ఆచితూచి ఆడుతోంది. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ వికెట్ పోగొట్టుకున్న భారత్.. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 86/1తో ఆటను కొనసాగించిన కోహ్లీసేన ఆరంభంలోనే రెండు వికెట్లు పోగొట్టుకుంది. పూజారా(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అబు జాయేద్ బౌలింగ్ లో సైఫ్ హస్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిపాటి విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) డకౌట్ గా నిరాశపరిచాడు. 

తొలి రోజు ఓపెనర్ గా దిగిన మాయంక్.. నెమ్మెదికగా ఆడుతూ సమయోచిత బౌండరీలతో సెంచరీకి చేరువగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ అజింకా రహానె(26), మయాంక్ అగర్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. కాగా, బంగ్లా బౌలర్లలో అబూ జాయేద్‌కే మూడు వికెట్లు దక్కడం గమనార్హం.