IndVsSA 1st T20I : గర్జించిన భారత బౌలర్లు, కుప్పకూలిన సఫారీలు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
IndVsSA 1st T20I : సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. భారత బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా జట్టు 106 పరుగులకే పరిమితమైంది. భారత్కు 107 పరుగుల స్వల్ప లక్ష్యంగా నిర్దేశించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ (41 పరుగులు) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్క్రమ్ (25), పార్నెల్ (24) ఫర్వాలేదనిపించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లలో నలుగురు డకౌట్ కాగా.. ముగ్గురు గోల్డెన్ డక్ కావడం విశేషం. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
టీమిండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీలు… 100 పరుగుల మార్కు అందుకున్నారంటే ఆ క్రెడిట్ కేశవ్ మహరాజ్ కే దక్కుతుంది. కేశవ్ మహరాజ్ 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సులతో విలువైన పరుగులు జోడించాడు. అతడికి పార్నెల్ నుంచి మంచి సహకారం లభించింది.