IPL 2020: ముంబై టార్గెట్ 111

IPL 2020: ముంబై టార్గెట్ 111

IPL 2020 లో 51వ మ్యాచ్ ను ఆడిన ముంబై వర్సెస్ ఢిల్లీలో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ పేలవంగా ఇన్నింగ్స్ ముగించింది. ఒక్కరు కూడా 25పరుగులు ధాటి స్కోరు చేయలేకపోయారు. కెప్టెన్ ఒక్కడే(25)పరుగులు చేయడంతో ఆ జట్టు పేలవంగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9వికెట్లు నష్టపోయి 110పరుగులు మాత్రమే చేయగలిగింది.




ఆ జట్టు స్కోరు వివరాలిలా ఉన్నాయి. పృథ్వీ షా (10), శిఖర్ ధావన్(0), రిషబ్ పంత్(21), మార్కస్ స్టోనిస్(2), హెట్‌మేయర్ (11), హర్షల్ పటేల్(5), రవిచంద్రన్ అశ్విన్(12)లు అవుట్ అవగా 20 ఓవర్లు ముగిసేసరికి ప్రవీణ్ దూబె(7), కగిసో రబాడ(12)లు క్రీజులో నిలిచారు.