IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్
IPL 2022 : ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ పట్టేసింది గుజరాత్ టైటన్స్.. ఇప్పటివరకూ ఐపీఎల్లో తిరుగులేదని భావించిన అన్ని ఫేవరెట్స్ జట్లకు షాకిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ 2022 ట్రోఫీని హార్దిక్ పాండ్యా సేన ఎగరేసుకు పోయింది.
IPL 2022 : ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ పట్టేసింది గుజరాత్ టైటన్స్.. ఇప్పటివరకూ ఐపీఎల్లో తిరుగులేదని భావించిన అన్ని ఫేవరెట్స్ జట్లకు షాకిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ 2022 ట్రోఫీని హార్దిక్ పాండ్యా సేన ఎగరేసుకు పోయింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా హార్దిక్ సేనకు సోమవారం అహ్మదాబాద్లో ఘన స్వాగతం పలికారు. జట్టు సభ్యులందరూ ట్రోఫీతో పాటు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా వచ్చారు. ఐపీఎల్ అభినుమాలంతా వీధుల్లోకి చేరి జట్టుతో సందడి చేశారు. సోమవారం సాయంత్రం ఉస్మాన్పురా రివర్ఫ్రంట్ నుంచి ప్రారంభమై.. విశ్వకుంజ్ రివర్ఫ్రంట్ దగ్గర బస్ పరేడ్ ఎండ్ అయింది.
విజయోత్సవాల సందర్భంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రా, ఇతర టీమ్ సభ్యులందరినీ గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ఘనంగా సత్కరించారు. ప్లేయర్స్ బస్సుపై ఊరేగుతున్న సమయంలో ఫ్లైఓవర్లపై పూల వర్షం కురిపించారు. ఓపెన్ టాప్ బస్ పరేడ్ వీడియోను జట్టు సభ్యుడు శుభ్మన్ గిల్ షేర్ చేసుకున్నాడు.
ఫ్యాన్స్ కోలాహాలంతో గుజరాత్ టైటాన్స్ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ సీజన్లో సొంతగ్రౌండ్లో సింగిల్ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. అదే గ్రౌండ్లో విజయం సాధించి ట్రోఫీ గెల్చుకుంది. ఊరేగింపు సమయంలో గుజరాతీకి చెందిన నృత్యాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి.
Read Also : IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్లోనే కప్పు నెగ్గి చరిత్ర