IPL 2022: పింక్ వదలని రాజస్థాన్.. చారల చొక్కాతో కొత్త జెర్సీ

అందరికంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ డిజైన్ తో వచ్చింది రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్ IPL 2022కు గానూ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. దీని అనౌన్స్‌మెంట్ ను సినీ ఫక్కీలో సెట్ చేసిన..

IPL 2022: పింక్ వదలని రాజస్థాన్.. చారల చొక్కాతో కొత్త జెర్సీ

Rajasthan Royals

IPL 2022: అందరికంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ డిజైన్ తో వచ్చింది రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్ IPL 2022కు గానూ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. దీని అనౌన్స్‌మెంట్ ను సినీ ఫక్కీలో సెట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ.. సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ లకు అందించింది.

బైక్ రైడర్ జెర్సీ తీసుకుని రాజస్థాన్ మొత్తం తిరిగి.. అనుమతి లేని ప్రాంతాల్లోనూ బైక్ రైడింగ్ చేస్తూ మెరుపు వేగంతో దూసుకొచ్చి ఎట్టకేలకు శాంసన్, చాహల్ లకు జెర్సీ అందించాడు. అలా జెర్సీ ప్రమోషన్ వీడియో ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఎదురుచూస్తున్న ప్లేయర్లకు అందించిన బైక్ రైడర్ వెనక్కు వెళ్లిపోయాడు.

ఇదిలా ఉంటే, జెర్సీ డిజైన్ పింక్, బ్లూ కలర్స్ లోనే ఉంది. కానీ, పింక్ అడ్డ చారలతో వినూత్నంగా కనిపిస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ప్లెయిన్ జెర్సీలే వాడుతుంటే రాజస్థాన్ మాత్రమే చారలతో ఉండే జెర్సీని రూపొందించింది. ఇక జెర్సీపై హ్యాప్పీలో, డాలర్, జియో, రెడ్ బుల్ లాంటి లోగోలు కనిపించాయి.

Read Also: వేలం తర్వాత రాజస్థాన్ జట్టు పూర్తి వివరాలివే

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ. ‘ఇది నిజంగా అద్భుతం. స్పెషల్ డెలివరీలో కనిపించిన రాబీ అమేజింగ్ స్టంట్స్ అబ్బురపరిచాయి. అతణ్ని తొలి సారి చూశా. క్రికెట్ ఆడకపోతే నేనూ ఒకసారి అది ట్రై చేయాలనుకుంటున్నా’ అని శాంసన్ వివరించారు.