IPL Season 15 : బుక్ మై షోతో ఒప్పందం.. IPL టికెట్లు

టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికగా ఉన్న ‘బుక్ మై షో (bookmyshow) తో ఒప్పందం చేసుకుంది. 15వ సీజన్ కు...

IPL Season 15 : బుక్ మై షోతో ఒప్పందం.. IPL టికెట్లు

Ipl

IPL – Bookmyshow : ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2022, మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ లో 10 జట్లు తలపడనున్నాయి. మొత్తం 70 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇందుకు అన్నీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ముంబై, నవీ ముంబై, పుణెలో ఉన్న నాలుగు మైదానాలను బీసీసీఐ (BCCI) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే, బ్రాబౌర్న్ మైదానాల్లో 20 చొప్పున మ్యాచ్ లను నిర్వహించనున్నారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 15, పుణెలోని MCA ఇంటర్నేషన్ లో స్టేడియంలో 15 మ్యాచ్ లు జరుగుతాయి.

Read More : IPL 2022 : గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పాండ్యా వస్తున్నాడు.. యో-యో టెస్టు పాస్..!

అయితే.. టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికగా ఉన్న ‘బుక్ మై షో (bookmyshow) తో ఒప్పందం చేసుకుంది. 15వ సీజన్ కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను పొందింది. టికెట్ రైట్స్ తో పాటు.. అన్నీ స్టేడియంలో గేట్ ఎంట్రీ, స్పెక్టేటర్ మేనేజ్ మెంట్ సర్వీసులను అందించనుంది. ఇక మ్యాచ్ విషయాలకు వస్తే.. వాంఖడే తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనుంది. 2022, మార్చి 23వ తేదీ బుధవారం నుంచే టికెట్ బుకింగ్ కు అవకాశం ఇస్తున్నామని బుక్ మై షో పేర్కొంది. ఒక్కో టికెట్ ధర రూ. 800 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-15) మ్యాచ్ లకు 25 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నామని బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.