భారత్ – ఇంగ్లాండ్ టెస్టు : జో రూట్ డబుల్ సెంచరీ
Joe Root Double Century : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్లో పరుగుల వరద పారుతోంది. చెపాక్ పిచ్పై ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ పండుగ చేసుకున్నాడు. భారత బౌలర్లను ఆటాడుకుంటూ తన వందో టెస్టులోనూ సెంచరీ బాదేసి హ్యాట్రిక్ శతకం నమోదు చేశాడు. రెండో రోజూ బ్యాటింగ్ కొనసాగిస్తున్న రూట్..కాసేపటి క్రితం డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
బెన్ స్టోక్స్తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 263/3 ఓవర్నైట్ స్కోర్తో శనివారం ఆట ప్రారంభించింది ఇంగ్లాండ్. తొలి టెస్టు ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 400 స్కోర్ చేసింది. నదీమ్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ (82, 117 బంతులు) పెవిలియన్ చేరాడు. రెండో సెషన్స్ లో డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 132 ఓవర్లకు 400/4 స్కోర్ తో నిలిచింది.
కెరీర్లో 20వ సెంచరీతో జట్టును భారీస్కోరు వైపు తీసుకెళ్తున్న జో రూట్ పలు రికార్డులను నెలకొల్పాడు. వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా రూట్ నిలిచాడు. 98, 99, 100వ టెస్టుల్లో శతకాలు బాదిన ఏకైక క్రికెటర్గానూ సంచలనం సృష్టించాడు. దీనికి తోడు భారత్లో తానాడిన ఏడు టెస్టుల్లో ప్రతిదాంట్లోనూ హాస్సెంచరీకి తగ్గకుండా పరుగులు సాధించాడు.