ధోని కొత్త ఇన్నింగ్స్.. ‘కెప్టెన్ 7’ సిరీస్‌తో వచ్చేస్తున్నారు

ధోని కొత్త ఇన్నింగ్స్.. ‘కెప్టెన్ 7’ సిరీస్‌తో వచ్చేస్తున్నారు

M S Dhoni Announces Animated Spy Series Captain 7

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ‘కెప్టెన్ 7’ అనే యానిమేటెడ్ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు. ఈ డిటెక్టివ్ సిరీస్ మొదటి సీజన్ ధోనిపై ఆధారపడి ఉండనున్నట్లు యూనిట్ ఓ ప్రకటన చేసింది. ‘కెప్టెన్ 7’ అంటే ధోనీ జెర్సీ నంబర్ 7 కాగా.. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో, ఐపీఎల్‌లో అదే జెర్సీతో కనిపించేదారు. కాగా.. అందుకు గుర్తుగా.. ‘Captain 7′ అనే పేరు పెట్టినట్లుగా అర్థం అవుతోంది.

మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షి సింగ్ ధోని ప్రొడక్షన్ హౌస్‌ ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. బ్లాక్ వైట్ ఆరెంజ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BWO) సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనీ వివిధ రంగాల్లో అడుగు పెట్టి రాణిస్తున్నారు. ఇప్పటికే క్రీడా వ్యాపారంలో దిగిన ధోని, సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ‘కెప్టెన్‌ 7’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ధోనీ ఆధారంగా కథ తెరకెక్కుతోండగా.. ‘కథ, కథనం చాలా బాగుంటుందని, క్రికెట్‌తో పాటు నా ఇతర అభిరుచులు ఇందులో ఉన్నాయి’ అని ధోని తెలిపాడు. ‘కెప్టెన్‌ 7’ పూర్తిగా సాహసోపేతంగా ఉంటుందని, 2022లో వివిధ వేదికల్లో తొలి సీజన్‌ మొదలవుతుందని, నిర్మాతలు చెబుతున్నారు. ధోని, మరోవైపు 2021 ఐపీఎల్ సీజన్ కోసం కష్టపడుతూ ఉన్నాడు.