Mahendra Singh Dhoni : న్యూలుక్ లో ధోని.. సరదాగా స్నేహితులతో కాలక్షేపం

మహేంద్ర సింగ్ ధోని స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. కాగా కరోనా కారణంగా గత కొంతకాలంగా రాంచిలోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ధోని. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూర్ వెళ్లివచ్చారు ధోని. ఇక ఐపీఎల్ కూడా లేకపోవడంతో తన ఫామ్ హౌస్ లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.

Mahendra Singh Dhoni : న్యూలుక్ లో ధోని.. సరదాగా స్నేహితులతో కాలక్షేపం

Mahendra Singh Dhoni

Mahendra Singh Dhoni :  మహేంద్ర సింగ్ ధోని స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. కాగా కరోనా కారణంగా గత కొంతకాలంగా రాంచిలోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ధోని. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూర్ వెళ్లివచ్చారు ధోని. ఇక ఐపీఎల్ కూడా లేకపోవడంతో తన ఫామ్ హౌస్ లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాంచీలోని తన స్నేహితులను కలిశారు ధోని, వారితో కలిసి కార్ గ్యారేజిలో భోజనం చేస్తూ సరదాగా గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్‌ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన స్టార్ హోదాను పక్కకు పెట్టి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడాన్ని అభినందిస్తున్నారు.

ఇక ఐపీఎస్ విషయానికి వస్తే మార్చి – ఏప్రిల్ నెలల్లో కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో వాయిదా పడిన విషయం విదితమే. సెప్టెంబర్ లో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఏడు మ్యాచ్ లు ఆడగా ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో ఢిల్లీ ఛాంపియన్స్ ఉన్నారు.