మ్యాచ్ ఓడినా.. ఫ్యాన్స్ హార్ట్స్ గెలిచిన విలయమ్సన్!

  • Published By: sreehari ,Published On : December 30, 2019 / 07:12 AM IST
మ్యాచ్ ఓడినా.. ఫ్యాన్స్ హార్ట్స్ గెలిచిన విలయమ్సన్!

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెల్చుకున్నాడు. ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరిగింది ఈ టెస్టు క్రికెట్‌లో కివీస్ ఘోర పరాజయం పాలైంది.

వరుసగా రెండో టెస్టులోనూ ఓడిపోవడంతో జట్టంతా నీరుగారిపోయింది. అయినా జట్టు కెప్టెన్‌గా విలియమ్సన్ మాత్రం ఆ బాధను పైకి కనిపించకుండా తమ క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచాడు. మ్యాచ్ అనంతరం ఆడియోన్స్ గ్యాలరీ దగ్గరగా వచ్చి క్రీడాస్ఫూర్తితో కేన్ వ్యవహరించాడు.

మీ అందరి ప్రోత్సాహాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మ్యాచ్ ఓడినా ఆ బాధ కూడా తెలియడం లేదు. మ్యాచ్ సమయంలో మీ అరుపులతో మమ్మల్ని ఉత్సాహపరిచినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. మీలా గట్టిగా అరుస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని మాకు ఉంటుంది.. మాకు పరిమితులు ఉన్నాయని నాకు తెలుసు.. మీరంతా మ్యాచ్ ఎంజాయ్ చేసారని భావిస్తున్నాను.

ఈ టెస్టు మ్యాచ్ లో మీరిచ్చిన ఉత్సాహం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. మ్యాచ్ కోసం పడిన కష్టాన్ని ఎంతో మెచ్చుకోవాలి. మ్యాచ్ ఫలితం ఏదైనా.. ఫుట్ బాల్ ఆటగాళ్లు కొంచెం ఇలానే ఫీల్ అవుతారనని నేను ఊహించగలను.

కానీ, క్రికెట్ పై పాషన్ అనేది నిజంగా స్ఫూర్తినిచ్చేది. మీ అందరికి నా కృతజ్ఞతలు’ అంటూ విలియమ్సన్ కివీస్ అభిమానులతో ముచ్చటించాడు. కేన్ ఫ్యాన్స్ తో మాట్లాడిన తర్వాత కివీస్ అభిమానులంతా గట్టిగా అరుస్తూ విలియమ్సన్ కు అభినందనలు తెలిపారు. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌లో రెండు టెస్టుల్లోనూ కివీస్ ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు ఆసీస్ 2-0 ఆధిక్యంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్టు సిరీస్ తన ఖాతాలో వేసుకుంది.

విలియమ్సన్ న్యూజిలాండ్ అభిమానులతో కలిసి ముచ్చటిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ట్విట్టర్ యూజర్లు కూడా కివీస్ కెప్టెన్ విలయమ్సన్ క్రీడాస్ఫూర్తిని అభినందిస్తున్నారు..గ్రేట్ మ్యాన్.. మైదానంలోనూ బయట అతడే నిజమైన చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.