India vs Newzeland: కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో.. కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి.. కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 4, సిరాజ్ 3 వికెట్లు తీశారు.

India vs Newzeland: కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్

Match

India vs Newzeland: భారత్ పై.. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ పదికి పది వికెట్లు తీసిన ఆనందం.. ఆ జట్టుకు ఎంతో సేపు మిగల్లేదు. వారి సంబరాలు పూర్తయ్యేలోపే.. ఆ జట్టుకు భారత బౌలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. వారి ఆనందాన్ని ఆవిరి చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా చేసిన 325 పరుగులను ఛేదిస్తూ బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను.. ఆది నుంచీ ఇబ్బంది పెట్టారు. అశ్విన్, సిరాజ్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్.. అంతా కలిసి.. 62 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇండియాకు 263 పరుగుల భారీ ఆధిక్యాన్ని కూడగట్టారు. కివీస్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టారు. అయితే.. కివీస్ కు ఫాలో ఆన్ ఇవ్వకుండా.. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది భారత జట్టు.

అంతకు ముందు.. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన భారత జట్టుపై కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 47.5 ఓవర్ల పాటు సుదీర్ఘమైన బౌలింగ్ చేసి.. భారత జట్టు మొత్తాన్నీ ఆలౌట్ చేశాడు. పదికి పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సరిగ్గా.. 150 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా ఆటగాళ్లలో శుభ్ మన్ గిల్ 44, అక్షర్ పటేల్ 52, వృద్ధిమాన్ సాహా 27, శ్రేయస్ అయ్యర్ 18, జయంత్ యాదవ్ 12 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టుకు.. భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఏ మాత్రం కుదురుకోనీయకుండా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓపనర్ టామ్ లాథమ్ (10), కైల్ జేమీసన్ (17) మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. మిగతా అంతా.. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.