PV Sindhu: ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధు క్యాష్ రివార్డులివే

ఇండియా స్టార్ షట్లర్.. హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది.

PV Sindhu: ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధు క్యాష్ రివార్డులివే

Pv Sindhu

PV Sindhu: ఇండియా స్టార్ షట్లర్.. హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది. సుశీల్ కుమార్ తర్వాత ఈ ఫీట్ సాధించింది సింధు మాత్రమే.

పవర్‌ఫుల్ షాట్స్ ఆడి.. చైనాకు చెందిన హె బింగ్ జావో (21-13, 21-15)పై విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్నారు. టోక్యోకు వెళ్లకముందే పతకం తీసుకొస్తుందని ఆశించిన కలలను నిజం చేశారు.
2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజితాన్ని అందుకున్న సింధు.. బ్యాడ్మింటన్ జర్నీలో వేగం చూపించారు. మిక్స్‌డ్ టీమ్స్‌తో గోల్డ్, 2018 కామెన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ సాధించారు. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.

ఒలింపిక్స్ 2020కంటే ముందే మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి హాజరయ్యారు. మార్చి నుంచి జులైవరకూ ప్రాక్టీస్ చేసిన ఆమె.. కెరీర్ లో మరో ప్రపంచ స్థాయి పతకం అందుకున్నారు. ఆమెను అభినందిస్తూ.. ఇప్పటికే నగదు రివార్డును ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీసీసీఐ, ఐఓఏ, బైజూస్.

క్యాష్ రివార్డు వివరాలిలా:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.30లక్షలు
బీసీసీఐ రూ.25లక్షలు
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రూ.25లక్షలు